![]() |
![]() |
by Suryaa Desk | Wed, Mar 26, 2025, 02:04 PM
TG: రెండ్రోజుల క్రితం హైదరాబాద్లోని MMTS రైలులో ఓ యువతిపై దుండగుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డ విషయం తెలిసిందే. బాధితురాలు చెప్పిన పోలికల ఆధారంగా పాతనేరస్తుడు మహేశ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ బాధితురాలు నిందితుడిని చూసి అతను కాదని చెప్పినట్టు సమాచారం. దీంతో ఈ కేసు విచారణ మళ్లీ మొదటికి వచ్చింది. అయితే. పోలీసులు మహేశ్తో పాటు మరికొందరు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.