|
|
by Suryaa Desk | Tue, Jan 27, 2026, 03:06 PM
ఒకప్పుడు ఎస్యూవీల ట్రెండ్ను సెట్ చేసిన రెనో 'డస్టర్' మళ్లీ వచ్చేసింది. సరికొత్త 'థర్డ్ జనరేషన్' రూపంలో ఈ మోడల్ను రెనో ఇండియా అధికారికంగా ప్రదర్శించింది. మార్కెట్లోకి రీ-ఎంట్రీ ఇస్తున్న ఈ ఎస్యూవీ ధరలను మార్చి నెలలో ప్రకటిస్తామని సంస్థ వెల్లడించింది. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతీ గ్రాండ్ విటారా వంటి దిగ్గజ మోడళ్లకు గట్టి పోటీ ఇచ్చేందుకు రెనో సన్నాహాలు చేస్తోంది.కొత్త డస్టర్ పాత మోడల్ కంటే చాలా భిన్నంగా, మరింత రగ్గడ్ లుక్తో కనిపిస్తోంది. సరికొత్త 'వై-షేప్' ఎల్ఈడీ లైటింగ్, మస్క్యులర్ వీల్ ఆర్చెస్ దీనికి ప్రీమియం అప్పీల్ను ఇస్తున్నాయి. లోపలి భాగంలో 10.1 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే వంటి అడ్వాన్స్డ్ ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా డ్రైవింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి 'అడాస్' టెక్నాలజీని కూడా ఇందులో పొందుపరిచారు.పర్యావరణ హితమైన ప్రయాణం కోసం రెనో ఈసారి హైబ్రిడ్ ఇంజిన్లకు ప్రాధాన్యతనిచ్చింది. ఈ కొత్త డస్టర్ 1.2-లీటర్ టర్బో-పెట్రోల్, 1.6-లీటర్ ఫుల్ హైబ్రిడ్ పవర్ట్రెయిన్ ఆప్షన్లతో రానుంది. ఆఫ్రోడ్ ప్రియుల కోసం ఇందులో ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉండటం విశేషం.