"మొబైల్ యాక్సెసరీస్ పార్క్" ను ప్రారంభించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్...
Fri, Oct 04, 2024, 05:12 PM
by Suryaa Desk | Fri, Jul 05, 2024, 02:51 PM
నల్గొండ జిల్లా చందంపేట మండలం యాపలపాయ తండాలో విషాదం చోటుచేసుకుంది. తండాకు చెందిన మంగ్తా నాయక్(56) అనే రైతు ఆర్థిక ఇబ్బందులతో గురువారం పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగ్త ఇటీవల తన వ్యవసాయ భూమిలో పత్తి విత్తనాలు విత్తారు. వర్షాలు కురవకపోవడం, గతంలో చేసిన అప్పులు తీర్చే మార్గం లేక తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో తన వ్యవసాయ పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.