by Suryaa Desk | Sat, Oct 05, 2024, 07:01 PM
మచ్చబొల్లారం డివిజన్ పరిధిలోని కోర్ట్ యార్డ్ కాలనీ వాసులు క్యాంపు కార్యాలయంలో మల్కాజగిరి ఎమ్మెల్యే మర్రి రాజశకేర్ రెడ్డీని కలిసి మేరుగైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కొరారు.
చాలా కాలం నుండి కాలని లో డ్రైనేజ్ పొంగుతూ రోడ్ల పైకి ప్రవహిస్తుందని తెలిపారు.వర్షాకాలంలో నీరు పోయే దారి లేక రోడ్డుపైనే నిలుస్తుందని, ఆ సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీని ఏర్పాటు చేయాలన్నారు. అధికారులు ఎన్ని అభ్యర్థనలు ఇచ్చినా పట్టించుకోవడం లేదని విన్నవించారు.
ఈ సందర్బంగ ఎమ్మెల్యే మాట్లాడుతు.. త్వరలోనే కాలనిలో పర్యటించి సమస్యలు తెలుసుకుంటానని డ్రైనేజీ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపిస్తానని వారికి హామీ ఇచారు.
నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో స్థానికులను వేధిస్తున్న డ్రైనేజీ వ్యవస్థను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేపడుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు.