by Suryaa Desk | Fri, Oct 04, 2024, 06:14 PM
పొట్టకూటి కోసం కూలి పనులకు పోయిన వ్యవసాయ కౌలు రైతులు ఉరుములు మెరుపులు తో కూడిన భారీ వర్షంలో పిడుగు పడి మృతి చెందిన కుటుంబాలకు ఒక్కొక్కరికి పది లక్షల చొప్పున ఎక్స్ కేసులో చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమిరెడ్డి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆత్మకూరు మండలం చౌలపల్లి గ్రామంలో పిడుగు పడి మృతి చెందిన మహిళా కౌలు రైతు లు నిర్మల, రమ అంత్యక్రియల్లో పాల్గొని బాధ్యత కుటుంబాలను ఓదార్చారు.
సోమిడి శ్రీనివాసు మాట్లాడుతూ వెంటనే ప్రభుత్వం రైతులను యూనిట్ల వారీగా తీసుకొని రైతు బీమా కల్పించాలన్నారు. ప్రమాదవశాత్తు పిడుగు పడి మృతి చెందిన బాధితుల కుటుంబాలకు 10 లక్షలు చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లించి బాధ్యత కుటుంబాలకు అండగా నిలవాలని అన్నారు. ఆయనతోపాటు తెలంగాణ రైతు రక్షణ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వరికల కిషన్ రావు, ఆరే యువసేన వరంగల్ జిల్లా అధ్యక్షులు రఘుపతి, అదరసాని రాజ్ కుమార్, సోలంకి రవి, మోరే రాజేశ్వరరావు, మోరే రాజు, మరిగిద్ద రాజేశ్వరరావు పలువురు ఉన్నారు