"మొబైల్ యాక్సెసరీస్ పార్క్" ను ప్రారంభించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్...
Fri, Oct 04, 2024, 05:12 PM
by Suryaa Desk | Fri, Oct 04, 2024, 08:46 PM
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఈదుల గట్టెపల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇంట్లో మంటలు చెలరేగడంతో ఇంట్లో నిద్రిస్తున్న ఏడేళ్ల బాలుడు సజీవ దహనమయ్యాడు.గ్రామంలో నివాసముంటున్న అంగిడి అనితరాజు ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇంట్లో నిద్రిస్తున్న వారి కుమారుడు అంగిడి సాయికుమార్ (7) మంటల్లో సజీవ దహనమయ్యాడు. సాయికుమార్ కరీంనగర్ వసంత్ వలీ పాఠశాలలో యూకేజీ చదువుతున్నాడు. బాలుడు సజీవ దహనం కావడంతో గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది.