by Suryaa Desk | Sat, Oct 05, 2024, 01:23 PM
దేవరకొండమండలంలోని కొండభీమన పల్లి గ్రామ పరిధిలో ఉన్న రైతు వేదికలో శుక్రవారం నాడు నల్గొండ జిల్లా ఆయిల్ పామ్ రైతుల అవగాహన సదస్సు ఉద్యాన శాఖ వారి సహకారంతో పతాంజలి ఫుడ్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆయిల్ పామ్ సాగుతో తక్కువ పెట్టుబడితో రైతులు ఎక్కువ లాభాలు ఆర్జించేందుకు అవకాశముందని అన్నారు రైతులు సంప్రదాయ పంటలకు బదులుగా అధిక లాభాలు అందించే ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. ఆయిల్ పామ్ మొక్కలు నాటిన తరువాత నాలుగో సంవత్సరం నుంచి దిగుబడులు ప్రారంభం అవుతాయని, 25 సంవత్సరాల వరకు ఈ మొక్క దిగుబడి ఇస్తూ రైతులకు ఆదాయాన్ని ఆర్జించి పెడుతుందన్నారు. ఆయిల్ పామ్ వల్ల కలిగే లాభాలు గురించి రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తూ, ఆసక్తి అనుకూల పరిస్థితులు కలిగి ఉన్న రైతులు ఆయిల్ పామ్ సాగు చేసేలా చూడాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహా,మాజి ఎంపీపీ జాని యాదవ్,మండల పార్టీ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, సీనియర్ నాయకులు దేవేందర్ నాయక్ ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, యువజన విభాగ నాయకులు రైతులు, హార్టికల్చర్ అధికారులు డి హెచ్ ఎస్ ఓ సాయి బాబా, ఏపీడి శ్రీనివాసులు, డీజీఎం యాదగిరి,సుబ్బ రెడ్డి, కిరణ్,రాజా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.