by Suryaa Desk | Sat, Oct 05, 2024, 07:28 PM
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం మల్లన్నపేట గ్రామంలో బీజేపీ నూతన సభ్యత్వ నమోదు కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న అసెంబ్లీ కన్వీనర్ కొమ్ము రాంబాబు మాట్లాడుతూ దేశంలోనే అతి పెద్ద పార్టీగా అత్యంత ప్రజాదరణ పొందిన పార్టీగా బీజేపీ అవతరించిందని అన్నారు.నియోజకవర్గంలో ప్రజలందరూ బీజేపీ సభ్యత్వ నమోదుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు కట్ట మహేష్,జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెల్లి సత్యం,మాజీ అసెంబ్లీ కన్వీనర్ సీనియర్ నాయకులు కస్తూరి సత్యం,మండల ఉపాధ్యక్షులు భీమా మహేష్,బూత్ అధ్యక్షులు దాసరి మల్లయ్య,బండారు నరేష్,వనపర్తి రాజేందర్,బీజేపీ సీనియర్ నాయకులు,ఐటీ సెల్ కన్వీనర్ గాజుల శ్రీధర్,రంగు ప్రేమ్ శివాజీ ,దళిత మోర్ఛ నాయకులు మోరపల్లి బాలయ్య,యువ మోర్చ ప్రధాన కార్యదర్శి లక్కకుల రవి,సీనియర్ నాయకులు వినోద్,బండారి శ్రీనివాస్,కళ్లెం మల్లేష్,లంబ మహేష్,తదితరులు పాల్గొన్నారు.