by Suryaa Desk | Fri, Oct 04, 2024, 09:13 PM
హైదరాబాద్లోని ఉప్పల్(Uppal) మైదానం వేదికగా ఈనెల 12వ తేదీన భారత్-బంగ్లాదేశ్(India-Bangladesh) మధ్య టీ20 మ్యాచ్ జరుగనుంది. ఈ విషయాన్ని హెచ్సీఏ(HCA) అధ్యక్షుడు జగన్ మోహన్ శుక్రవారం అధికారికంగా ప్రకటించారు.ఈ మ్యాచ్ టికెట్లు శనివారం మధ్యాహ్నం 12:30 నిమిషాల నుంచి పేటీఎం ఇన్ సైడర్ వెబ్ సైట్ లేదా యాప్లో విక్రయాలు ఉంటాయని పేర్కొన్నారు. టిక్కెట్ల ప్రారంభ ధర రూ.750 ఉండగా.. గరిష్ఠ ధర రూ.15 వేలుగా ఉంటుందని తెలిపారు.ఈనెల 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకు సికింద్రాబాద్ జింఖానా మైదానంలో ఆన్ లైన్లో బుక్ చేసిన టిక్కెట్లను రిడంషన్ చేసుకోవాలని సూచించారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డుతో వచ్చి టిక్కెట్లు తీసుకోవచ్చని చెప్పారు. ఆఫ్ లైన్ కౌంటర్లలో టిక్కెట్లు విక్రయించడం లేదని.. హెచ్సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు స్పష్టం చేశారు. కాగా, ఉప్పల్ మైదానం వేదికగా జరిగే టీ20 మ్యాచ్ మూడోది కావడం గమనార్హం.