by Suryaa Desk | Fri, Oct 04, 2024, 05:18 PM
దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కాన్వాయ్ పై కాంగ్రెస్ నాయకుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని బిఆర్ఎస్ జగదేవపూర్ గ్రామ కమిటీ అధ్యక్షుడు బుద్ద నాగరాజు అన్నారు. గురువారం జగదేవపూర్ లో మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు బాధ్యతను మరచిపోయి, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేక బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు గుండాగిరి చేస్తున్నారని, ప్రజా రాజ్యమని చెప్పుకుంటూ గుండా రాజ్యం చేస్తున్నారని ఆరోపించారు. బిఆర్ఎస్ నేతలపై ఇలాగే దాడులు చేస్తే తిరిగి ప్రతి దాడులు తప్పవని హెచ్చరించారు.
మైనంపల్లి హన్మంతరావు హరీష్ రావుపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనుకకు తీసుకోవాలన్నారు. దుబ్బాక ఎమ్మెల్యేపై దాడికి పాల్పడిన వారిపై చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆరు గ్యారంటిలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని విమర్శించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ నేతలు విచ్చల విడిగా దాడులకు పాల్పడితే ప్రజలే వారికి తగిన బుద్ది చెప్పడం ఖాయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమైందని తెలిపారు.