by Suryaa Desk | Sat, Oct 05, 2024, 07:37 PM
పెద్దపల్లి జిల్లాలోని గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి కళాశాల చైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ గారు పాల్గొని గౌరీ దేవికి బతుకమ్మకు పూజలు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో విద్యార్థినిలు రకరకాల పూలతో బతుకమ్మను పే ర్చడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల అధినేత అల్లెంకి శ్రీనివాస్ మాట్లాడుతూ తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి, పువ్వులను దైవంగా భావించి గొప్ప సంస్కృతి తెలంగాణకు మాత్రమే సాధ్యమని.
ఈ పండగ ద్వారా ప్రపంచానికి మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పే గొప్ప పండగ అని, విద్యార్థినిలు పాటలు నేర్చుకుని భావితరాలకు మన ఆచార సాంప్రదాయాలు తెలియజేయాలని సూచించారు.అదేవిధంగా విద్యార్థులకు బహుమతులు ప్రధానోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యాపకురాల్లు విద్యార్థుల నృత్యాలు ఆటపాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి.అదేవిధంగా ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జే. రవీందర్, అధ్యాపకులు పాల్గొన్నారు.