by Suryaa Desk | Sat, Oct 05, 2024, 01:13 PM
చందంపేట మండల పరిధిలోని అచ్చంపేట పట్టి గ్రామంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ఫ్యామిలీ డిజిటల్ కార్డుల (FDC) సర్వే కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలను సక్రమంగా మరింత సమర్థవంతంగా అమలు చేయడానికే ఫ్యామిలీ డిజిటల్ కార్డులు (FDC) జారీ చేస్తున్నట్టు చెప్పారు. వన్ స్టేట్ – వన్ కార్డు ఆలోచనతో చేపట్టిన ఈ బహుళ ప్రయోజన కార్డుల జారీ ప్రక్రియను ప్రజలంతా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ, రైతు బీమా, రైతు భరోసా, షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి, ఆసరా పెన్షన్ వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు 30 శాఖలు 30 రకాలుగా సమాచారం సేకరించడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి.అలా కాకుండా అర్హులైన వారందరూ ఒకే కార్డు ద్వారా ఈ సేవలు పొందడానికి వీలుగా ఫ్యామిలీ డిజిటల్ కార్డు అందజేస్తారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహా, నల్గొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ సిరాజ్ ఖాన్, మండల పార్టీ అధ్యక్షులు బధ్య నాయక్, మాజి ఎంపీపీ జాని యాదవ్,పార్టీ నాయకులు భరత్,యువజన విభాగ నాయకులు కిన్నెర హరికృష్ణ, వంశీ అయ్యగారు, తహసీల్దార్,మండల ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు,వివిధ అనుబంధ సంఘాల నాయకులు, డి ఎఫ్ సి అధికారుల బృందం తదితరులు పాల్గొన్నారు.