by Suryaa Desk | Fri, Oct 04, 2024, 05:22 PM
గచ్చిబౌలి డివిజన్ లో మెరుగైన మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని వివేకానందనగర్లోని ఆయన నివాసంలో కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ.. గచ్చిబౌలి డివిజన్ అభివృద్ధి కి సహకరించాలని, డివిజన్లో నెలకొన్న పలు సమస్యలు, అభివృద్ధికోసం మరిన్ని నిధులు,డివిజన్లో అంపూర్తిగా మిగిలిపోయిన సీసీ రోడ్లను అదేవిధంగా మంచి నీటి వ్యవస్థను మెరుగుపర్చాలని కోరామన్నారు.
ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్,నల్లగండ్ల హుడా కాలనీ అధ్యక్షులు జలందర్ రెడ్డి,సంయుక్త కార్యదర్శి కృష్ణ మూర్తి,కోశాధికారి దొర బాబు, సీనియర్ నాయకులు శేఖర్ , ప్రసాద్,సుమన్,ప్రకాశ్,రాజు, మహేష్ పాల్గొన్నారు.