by Suryaa Desk | Fri, Oct 04, 2024, 05:12 PM
మొబైల్ రంగంలో హరీష్ వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. అనంతరం జీడిమెట్ల డివిజన్ అంగడిపేటలో హరీష్ అండ్ ప్రకాష్ ల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన "మొబైల్ యాక్సెసరీస్ పార్క్" ను ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత ఉద్యోగాన్వేషణ కాకుండా సొంత వ్యాపారాలు స్థాపించే విధంగా అభివృద్ధి చెందాలని అన్నారు. మొబైల్ రంగంలో హరీష్ వ్యాపారం ప్రారంభించిన అనతి కాలంలోనే నాలుగవ బ్రాంచ్ ఏర్పాటు చేయడం వ్యాపారం పట్ల వారి నిబద్ధతను చాటుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కుంట సిద్ది రాములు, నరేందర్ రెడ్డి, మల్లేష్ గౌడ్, సుధాకర్ గౌడ్, సమ్మయ్య నేత, కాలే గణేష్, నదీమ్ రాయ్, పులి మహేష్ తదితరులు పాల్గొన్నారు.