by Suryaa Desk | Fri, Oct 04, 2024, 05:28 PM
దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ గణపతి సచ్చిదానంద స్వామిజి అవధూత ప్రార్ధన మందిరాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి బుధవారం ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, టిపిసిసి ప్రధాన కార్యదర్శులు నర్సారెడ్డి భూపతిరెడ్డి, సొంటి రెడ్డి పున్నా రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, బ్లాక్ అధ్యక్షులు, డివిజన్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, మహిళ కాంగ్రెస్ నాయకులు, ఎస్సి మరియు ఎస్టీ సెల్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.