by Suryaa Desk | Sat, Oct 05, 2024, 07:16 PM
ఆపదలో ఉన్నవారికి సీ ఎం సహాయ నిధి ఎంతో మేలుచేస్తుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. అనంతరం కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద దుందిగల్ మున్సిపాలిటీ పరిధి మల్లంపేట్ కు చెందిన టి.వెంకటేశ్వర్లు, కొంపల్లి మున్సిపాలిటీ పరిధి దూలపల్లికి చెందిన ఎన్.లక్ష్మీనారాయణ లకు ఆరోగ్య పరిస్థితి బాగాలేదని స్థానిక నాయకుల ద్వారా సమాచారం అందుకున్న ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి టి.వెంకటేశ్వర్లు తండ్రి టీ బాలేశ్వరయ్య (రూ.1,10,000/- ఎన్.లక్ష్మీనారాయణ తండ్రి ఎన్. వీర రాజు (రూ.2,75,000/-) లకు ఎల్ఓసీ మంజూరు చేయించి.
లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆపదలో ఉండి ఆర్థిక సహాయం కోసం ఎదురుచూసే వారికి సీఎం సహాయనిధి ఎంతో భరోసానిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో దుందిగల్ మున్సిపాలిటీ మహిళా అధ్యక్షురాలు పడాల మనోజ, సీనియర్ నాయకులు శ్రీనివాస్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.