by Suryaa Desk | Sat, Jul 06, 2024, 08:16 PM
పెయిడ్ ఆర్టిస్ట్ అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎదుర్కొంటున్న గ్రూప్ 2 అభ్యర్థి సింధూ రెడ్డి తనపై చేస్తున్న ఆరోపణలపై స్పందించారు. ‘ఎన్నికల ముందు మా నిరుద్యోగుల కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల కోసం ప్రశ్నిస్తే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా పెయిడ్ ఆర్టిస్ట్ అని ట్రోలింగ్ చేస్తారా..?’ అని ఆమె ప్రశ్నించారు. తీన్మార్ మల్లన్న తనను శంఖినీ అంటున్నారని.. టీఎస్పీఎస్సీ సమస్యల మీద గత ప్రభుత్వంలో తాను వచ్చి మాట్లాడినప్పుడు శంఖినిలా కనిపించలేదా అని ప్రశ్నించారు. తనను పెయిడ్ ఆర్టిస్ట్ అని నిందించే వాళ్లు తాను ఏ పార్టీ కండువా అయినా కప్పుకున్నట్లు నిరూపించగలరా? అని సవాల్ విసిరారు. ఒక ఆడ బిడ్డను పట్టుకొని ఇష్టం వచ్చినట్లు ట్రోలింగ్ చేయడం ఎంతవరకు సమంజసం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం (జూలై 5) టీఎస్పీఎస్సీ వద్ద నిరుద్యోగులు ఆందోళన నిర్వహించారు. నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఆందోళనలో పాల్గొన్న సింధూ ఫోటోలు, వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇటీవల నిరుద్యోగుల సమస్యలపై కేటీఆర్ను సింధు కలిసిన ఫోటోలను షేర్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు.