|
|
by Suryaa Desk | Thu, Feb 12, 2026, 03:16 PM
పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహమ్మద్ (జేఈఎం) ఉగ్రవాద సంస్థపై ఐక్యరాజ్యసమితి (యూఎన్) సంచలన నివేదికను విడుదల చేసింది. గతేడాది ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన ఉగ్రదాడి వెనుక జైషే హస్తం ఉందని, ఆ సంస్థ మహిళలతో ప్రత్యేకంగా ఒక ఉగ్రవాద విభాగాన్ని కూడా ఏర్పాటు చేసిందని ఈ నివేదిక స్పష్టం చేసింది.ఐరాస భద్రతా మండలికి చెందిన ఆల్-ఖైదా, ఐసిస్ ఆంక్షల పర్యవేక్షణ బృందం ఈ నివేదికను రూపొందించింది. 2025 నవంబర్ 9న ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన దాడిలో 15 మంది మరణించారని, ఈ ఘటనతో జైషే మహమ్మద్కు సంబంధం ఉన్నట్లు తమకు సమాచారం అందిందని పేర్కొంది. ఈ దాడితో పాటు మరికొన్ని దాడులకు జైషే బాధ్యత వహించినట్లు ఒక సభ్య దేశం తెలిపినట్లు నివేదికలో పొందుపరిచారు.