అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
Mon, Apr 13, 2026, 04:03 PM
|
|
by Suryaa Desk | Mon, Apr 06, 2026, 02:20 PM
నిర్మల్ జిల్లా బాసర లోని జ్ఞాన సరస్వతి దేవాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబం దర్శించుకుంది. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు సీఎంకు ఘన స్వాగతం పలికారు. ఆలయంలోని సీఎం ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మనవడికి అక్షరాభ్యాసం చేయించారు. తర్వాత ఆలయ విస్తరణ అభివృద్ధి పనులకు సీఎం భూమిపూజ చేశారు. రూ.225 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.బాసరలోని జ్ఞాన సరస్వతి దేవాలయాన్ని పునరభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ఈ ప్లాన్లో ఆలయ రీడెవలప్మెంట్ నమూనాలోని ఒక భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.