|
|
by Suryaa Desk | Sat, Apr 04, 2026, 11:15 AM
ఆర్యసమాజ్ లేదా గుడిలో పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్న ప్రేమజంట, ఉన్నట్లుండి అకస్మాత్తుగా యువకుడి ఆత్మహత్య
హైదరాబాద్ – గండిమైసమ్మ ప్రాంతంలోని ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్న ఏపీ అనంతపురం జిల్లా పొట్లూరు మండలం చెర్లోపల్లి గ్రామానికి చెందిన లోకేష్(29) అనే యువకుడు అదే కంపెనీలో పనిచేస్తున్న ఓ యువతిని ప్రేమించగా, శనివారం పెళ్లి చేసుకుందామని అని నిర్ణయించుకున్న ప్రేమికులునిన్న శుక్రవారం కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓయో రూమ్ తీసుకుని, తాను పెళ్లి బట్టల్లో ఉన్నానని, భోజనం తీసుకురావాలని ప్రియురాలికి చెప్పిన లోకేష్
యువతి వచ్చి ఎన్ని సార్లు పిలిచినా తలుపు తీయకపోవడంతో, ఓయో సిబ్బంది సహాయంతో తలుపు బద్దలుకొట్టి చూడగా, అప్పటికే ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న యువకుడుఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించిన పోలీసులు