|
|
by Suryaa Desk | Mon, Dec 11, 2023, 12:25 PM
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. కాంగ్రెస్ పూర్తి మెజార్టీతో అధికారం చేజిక్కించుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మరో ఆరు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ మధ్యలోనే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉంది. రాష్ట్రంలో మెుత్తం 12,769 గ్రామపంచాయతీలు ఉన్నాయి. 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ప్రస్తుతం కొనసాగుతున్న పాలకవర్గం పదవీకాలం 2024 జనవరి 31న వస్తుంది. 2024 ఫిబ్రవరి నుంచి నూతన గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నిక కావాల్సి ఉంటుంది.
2018లో పాలకవర్గం రిజర్వేషన్ 5 సంవత్సరాలకు ఒక కాలపరిమితి, మరొక 5 సంవత్సరాలకు 2 పర్యాయములు సర్పంచులు, వార్డు సభ్యులు 10 సంవత్సరాల కాలానికి ఓకే రిజర్వేషన్ కొనసాగుతుందని చట్టం చేయడం జరిగింది. ఈ విధానం రూపొందించిన బీఆర్ఎస్ ప్రభుత్వం మారింది. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. గత ప్రభుత్వం రూపొందించిన 10 సంవత్సరాల కాలపరిమితి, (రెండు పర్యాయాల రిజర్వేషన్) మారుస్తుందా...? లేదా అనేది చర్చనీయాంశమైంది.