by Suryaa Desk | Sun, Oct 06, 2024, 02:41 PM
ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం చొప్పకట్లపాలెం గ్రామానికి చెందిన అమరబోయిన పాపారావు(32) కొద్ది నెలల క్రితం ఫైనాన్స్ లో ఆటో కొన్నాడు.నెలకు రూ.10 వేలు కిస్తీ కట్టాల్సి ఉండగా, ఆటో నడవకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యేవాడు.శుక్రవారం రాత్రి 1 గంటల సమయంలో ఇంటికి వెళ్ళిన పాపారావు.. భార్యతో గొడవ పడి, భార్యాపిల్లల్ని బలవంతంగా బయటకు పంపి ఆటో స్టార్ట్ చేసే తాడుతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.