by Suryaa Desk | Sun, Oct 06, 2024, 06:26 PM
మైనంపల్లి హన్మంతరావును విమర్శించే స్థాయి బిఆర్ఎస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డికి లేదని కాంగ్రెస్ పార్టీ తిగుల్ గ్రామ కమిటీ అధ్యక్షుడు ఉప్పల ప్రవీణ్ కుమార్ గుప్తా అన్నారు. శనివారం ఆయన జగదేవపూర్ లో మాట్లాడుతూ పూటకో పార్టీ మార్చే ప్రతాప్ రెడ్డి మైనంపల్లి హన్మంతరావును విమర్శించే స్థాయి కాదని చెప్పారు. మైనంపల్లి హన్మంతరావు ప్రజల పక్షాన ఎన్నో సేవ కార్యక్రమాలు చేశారని తెలిపారు. ప్రజా నేతగా పేరు ప్రతిష్ఠ గుర్తింపు పొందిన మైనంపల్లి హన్మంతరావుపై లేనిపోని ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని చెప్పారు.
ప్రతాప్ రెడ్డి ఇప్పటి వరకు ప్రజల ఓట్లతో గెలిచిన దాఖలాలు లేవని, అలాంటి ప్రతాప్ రెడ్డి ఓట్లతో ప్రజాప్రతినిధిగా పనిచేసిన మైనంపల్లి హన్మంతరావును విమర్శించడం సరైంది కాదన్నారు. ప్రతాప్ రెడ్డి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ ఓటమి కావడం ఖాయమన్నారు. జిల్లాలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకురావడానికి మైనంపల్లి హన్మంతరావు ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. రానున్న రోజుల్లో జిల్లాలో బిఆర్ఎస్ కనుమరుగు కావడం ఖాయమని ఎద్దేవా చేశారు.