by Suryaa Desk | Sun, Oct 06, 2024, 12:28 PM
నిజాం రజాకర్లకు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి పేద ప్రజల కడుపు నింపిన పోరాటయోధుడు పండగ సాయన్న అని నీలం మధు ముదిరాజ్ అన్నారు. చేవెళ్ల పట్టణంలో పండుగ సాయన్న విగ్రహా ప్రథమ వార్షికోత్సవంలో ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ తో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ ఈ పేద ప్రజలు ఆకలితో అలమటించకూడదని భూస్వాముల నుంచి ఆహార ధాన్యాలు దోచి పేద ప్రజల కడుపు నింపిన మహనీయుడని కొనియాడారు. ఆకలితో అల్లాడుతున్న గ్రామాలలో పండగ సాయన్న అడుగు పెడితే వారి కడుపు నింపి పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చిన ఘనత వల్లే సాయన్న కు పండగ సాయన్న పేరు వచ్చిందన్నారు. ముదిరాజ్ కులంలో పుట్టిన ఈ మహానీయుడు బంధుక్ ఎత్తి రజాకర్ల అన్యాయాలను ఎదిరించి ఎదురొడ్డి నిలిచి బహుజనాలకు అండగా నిలిచాడని గుర్తు చేశారు. అలాంటి మహావీరుడు స్ఫూర్తితో భవిష్యత్తు తరాలు పోరాటాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లింగం,యాదయ్య,శ్రీనివాస్, మహేందర్,శ్రీరాములు, యాదయ్య,శివరాజ్,గణేష్, వెంకటేశ్,రాము,మైసయ్య, జనార్ధన్,వెంకటయ్య చేవెళ్ల నియోజికవర్గ నుంచి వచ్చిన ముదిరాజ్ సోదరులు తదితరులు పాల్గొన్నారు.