by Suryaa Desk | Sun, Oct 06, 2024, 03:09 PM
కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసపూరిత హామీలు, అసత్యాలేనని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. తెలంగాణలో రైతు రుణాలను మాఫీ చేస్తామని నమ్మబలికిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులను మోసం చేసిందని చెప్పారు. దిక్కుతోచని స్ధితిలో తెలంగాణ రైతాంగం రుణమాఫీ కోసం తిరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ పార్టీ రైతులను నిండా ముంచింది.