by Suryaa Desk | Sun, Oct 06, 2024, 06:40 PM
ఈ నెల 7 వ తేదీన మెట్రో సాధన సమితి ఆధ్వర్యంలో జీడిమెట్ల విలేజ్ గాంధీ విగ్రహం వద్ద నిర్వహించే మహా ధర్నాకు మద్దతు నివ్వాలని కోరుతూ మెట్రో సాధన సమితి సభ్యులు ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని పేట్ బషీరాబాద్ లోని క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హైదరాబాద్ మహానగరంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఉత్తర భాగం మరింత వేగవంతంగా అభివృద్ధి చెందాలనే ఆలోచనతో కెసిఆర్ గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జే బి ఎస్ నుంచి అల్వాల్ మీదుగా తూముకుంట మార్గంతో పాటు పారడైజ్ నుంచి బోయిన్ పల్లి, సుచిత్ర, కొంపల్లి మీదుగా మేడ్చల్ వరకు మెట్రో రైలు విస్తరణ పై సర్వే సంస్థలకు పనులను అప్పగిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ పనులను పక్కనపెట్టి ఫోర్త్ సిటీ అంటూ నూతన మార్గానికి మెట్రోను విస్తరిస్తుందని, నిత్యం లక్షల మంది ఉద్యోగులు సుచిత్ర, కొంపల్లి, కుత్బుల్లాపూర్, ప్రాంతాల నుంచి నగరంలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారన్నారు. అతివేగంగా అభివృద్ధి చెందుతున్న నార్త్ సిటీకి మెట్రో సాధనకై కృషి చేస్తున్న మెట్రో సాధన సమితికి తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సంపత్, జార్జి, ఓరుగంటి వెంకట్, పుప్పాల నాగరాజు, మూర్తి, రవి రావు మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు.