by Suryaa Desk | Sun, Oct 06, 2024, 06:51 PM
భారతీయ జనతా పార్టీ భాచుపల్లి అధ్యక్షులు ప్రసాద్ రాజు ఆధ్వర్యంలో బాచుపల్లి బిజెపి పార్టీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అనంతరం పార్టీలో కొత్తగా చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా బాచుపల్లి కమిటీ ఉపాధ్యక్షులుగా నారాయణమూర్తి, సెక్రెటరీగా హరిత, మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలుగా పావని, జనరల్ సెక్రెటరీ గా స్వాతి,16 వ డివిజన్ అధ్యక్షుడుగా హనుమయ్య, ఉపాధ్యక్షుడిగా అశోక్, సెక్రటరీగా రాజు, బీజేవైఎం ఉపాధ్యక్షుడిగా చరణ్, జనరల్ సెక్రెటరీగా జయసింహారెడ్డి, సెక్రటరీలుగా అవినాష్ కిషోర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా ప్రహ్లాద్, వర్మ మరియు డాక్టర్స్ సెల్ కన్వీనర్ గా పద్మ రవికుమార్ లు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా బాచుపల్లి అధ్యక్షుడు ప్రసాద్ రాజు మాట్లాడుతూ పార్టీలో చేరిన వారికి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన వారికి పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బాచుపల్లి 1 వ డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావు, బాచుపల్లి ప్రధాన కార్యదర్శి శివప్రసాద్,ఉపాధ్యక్షులు రెపన్ కాశి, రాష్ట్ర ఎస్సీ సెల్ నాయకులు గజ్జల సంతోష్, ఓబిసి మార్చా అధ్యక్షులు ఉదయ్ కిరణ్, బీజేవైఎం అధ్యక్షులు భూపాల్ రెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్ సురేష్, బిజెపి సీనియర్ నాయకులు సాయి కృష్ణారెడ్డి, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు కార్తీక్, నిజాంపేట్ బీజేవైఎం అధ్యక్షుడు నరసింహారెడ్డి, యాపిల్ వెల్నెస్ సెంటర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.