|
|
by Suryaa Desk | Thu, Feb 12, 2026, 03:20 PM
లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ మేరకు లోక్ సభలో బీజేపీ ఓ నోటీసును ఫైల్ చేసినట్లు సమాచారం. అయితే, రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ప్రివిలేజ్ మోషన్ దాఖలు చేయలేదని తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా బుధవారం రాహుల్ గాంధీ లోక్ సభలో ప్రసంగించిన విషయం తెలిసిందే.రాహుల్ తన ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా కేంద్రం అమెరికాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకుందని, ప్రధాని మోదీ దేశాన్ని అమెరికాకు అమ్మేశాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె రాసిన బుక్ లో చైనా ఆక్రమణ విషయం స్పష్టంగా ఉందని, ఆ విషయంపై సభలో మాట్లాడకుండా అధికార పక్షం తనను అడ్డుకుంటోందని ఆయన ఆరోపించారు.