"మొబైల్ యాక్సెసరీస్ పార్క్" ను ప్రారంభించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్...
Fri, Oct 04, 2024, 05:12 PM
by Suryaa Desk | Fri, Jul 05, 2024, 01:45 PM
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు శుక్రవారం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్ తండాలో గుడుంబా స్థావరాలపై పోలీసులు ఎక్సైజ్ శాఖ సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 6లీటర్ల గుడుంబాను, 90లీటర్ ల బెల్లం పానకం స్వాధీనం చేసుకొని గుడుంబా స్థావరాన్ని ధ్వంసం చేశారు. ఎస్ఐ అనిల్ మాట్లాడుతు ఎవరైనా అక్రమంగా గుడుంబా తయారీ చేసినట్లయితే వారిని బైండోవర్ చేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.