"మొబైల్ యాక్సెసరీస్ పార్క్" ను ప్రారంభించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్...
Fri, Oct 04, 2024, 05:12 PM
by Suryaa Desk | Fri, Jul 05, 2024, 01:47 PM
జగిత్యాల రూరల్ మండలం పోలాసలోని 108 చక్రసహిత లలితా మాతా ఆలయంలో శుక్రవారం భక్తుల రద్దీ నెలకొంది. శ్రీ లలితా మాతా ఆలయంలో ప్రత్యేక అమావాస్య పురస్కరించుకొని 108 శ్రీ చక్ర యంత్రములకు మహిళలచే ఘనంగా కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు ఆశీర్వచనాలు అందుకున్నారు. ఉత్సవ నిర్వాహకులు భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు.