by Suryaa Desk | Fri, Jul 05, 2024, 03:30 PM
బీఆర్ఎస్ జాతీయ అధికార ప్రతినిధి పట్లోళ్ల కార్తీక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకుంటున్నారు. కానీ చివరకు మా పార్టీకి పట్టిన గతే పడుతుందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతమంది పార్టీ మారినా.. నేను మాత్రం నన్ను నమ్మిన పార్టీని మోసం చేయనని తేల్చి చెప్పారు.నేను పార్టీ మారను, మా అమ్మ పార్టీ మారదు. ఎలాంటి గడ్డు పరిస్థితి వచ్చిన బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటామని అన్నారు. ఆ రోజు ప్రత్యేక పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మారాం.. కానీ రాజకీయ అవసరాల కోసం, పనుల కోసం మారలేదు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి గొంతెత్తి చెప్పుకొచ్చారు.మా ఆడ బిడ్డ కవిత జైలులో ఉండి 120 రోజులు దాటింది. నిజంగా మేము బీజేపీతో కాంప్రమైజ్ చేసుకొని ఉంటే కవితక్క ఇంకా ఎందుకు జైలులో ఉంటుందని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో చేవెళ్లలో బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిలో ఉండాలని.. చిత్తశుద్ధితో ముందుకు సాగాలని సూచించారు