|
|
by Suryaa Desk | Wed, Oct 29, 2025, 02:17 PM
ప్రశంసలు పొందిన చిత్రనిర్మాత ప్రశాంత్ వర్మ, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుండి తన మూడవ ప్రాజెక్ట్ను ప్రకటించారు. 'మహాకాళి' అనే టైటిల్తో ఈ చిత్రం భారతదేశపు మొట్టమొదటి మహిళా సూపర్ హీరో చిత్రంగా గుర్తించబడింది. ఇది విడుదలకు ముందే సెన్సేషన్ ని సృష్టిస్తుంది. పూజ అపర్ణ కొలురు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో శుక్రాచార్య యొక్క కీలక పాత్రలో అక్షయ్ ఖన్నా నటించనున్నారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమాకి సంబందించిన అప్డేట్ ని రేపు అంటే అక్టోబర్ 30న ఉదయం 10:08 గంటలకి రివీల్ చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రానికి స్మారాన్ సాయి సంగీతాన్ని అందిస్తున్నారు. రివాజ్ రమేష్ దుగ్గల్ తన ఆర్కెడి స్టూడియోస్ బ్యానర్లో ఈ చిత్రాన్ని నిర్మించాడు.
Latest News