|
|
by Suryaa Desk | Thu, Oct 30, 2025, 06:56 PM
ప్రవీణ్ కె దర్శకత్వంలో ప్రముఖ నటుడు విష్ణు విశాల్ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ రాబోయే క్రైమ్ థ్రిల్లర్ కి 'ఆర్యన్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా అక్టోబర్ 31న విడుదల కానుంది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క బుకింగ్స్ ఓపెన్ అయ్యినట్లు ప్రకటించారు. ఈ విషయాని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో శ్రద్దా శ్రీనాథ్ మరియు మనాసా చౌదరి మహిళా లీడ్స్ గా కనిపించనున్నారు. ఈ చిత్రంలో సెల్వ రాఘవన్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా హరీష్ కన్నన్ మరియు సంగీత దర్శకుడుగా గిబ్రాన్ ఉన్నారు. విష్ణు విశాల్ స్టూడియోజ్, షుబ్రా మరియు ఆర్యన్ రమేష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ ఈ సినిమాని తెలుగులో నవంబర్ 7న విడుదల చేస్తుంది.
Latest News