|
|
by Suryaa Desk | Wed, Nov 12, 2025, 04:22 PM
తన కెరీర్ పట్ల కొంత అసంతృప్తి ఉందని నటి అను ఇమ్మాన్యుయేల్ అన్నారు. కెరీర్ ఆరంభంలో చేసినట్లుగా రొటీన్ కమర్షియల్ చిత్రాల్లో ఇకపై నటించకూడదని నిర్ణయించుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు. రష్మిక మందన్నతో కలిసి ఆమె నటించిన తాజా చిత్రం ‘ది గర్ల్ఫ్రెండ్’. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అను ఇమ్మాన్యుయేల్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.‘ది గర్ల్ ఫ్రెండ్’ చిత్రంలో పాత్ర చిన్నదే అయినా ఎంతో సంతృప్తిని ఇచ్చిందని పేర్కొంటూ, అమ్మాయిల గురించి ఒక మంచి విషయం చెప్పే సినిమా కాబట్టే నటించేందుకు ఒప్పుకున్నానని వెల్లడించింది. హాలీవుడ్లో లాగా హీరో, హీరోయిన్, విలన్ అనే తేడా లేకుండా అన్ని పాత్రలకు ప్రాధాన్యం ఇస్తూ దర్శకుడు రాహుల్ ఈ కథను తీర్చిదిద్దారని తెలిపింది. థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు కొన్ని సన్నివేశాలకు అబ్బాయిలు కూడా చప్పట్లు కొట్టడం చూసి తాను ఆనందించానని చెప్పుకొచ్చింది. కమర్షియల్ సినిమాల్లో ఓవర్ యాక్షన్ చేయిస్తారని, కానీ ఈ చిత్రంలో ‘దుర్గ’ పాత్ర కోసం చాలా సహజంగా నటించానని అను వివరించారు. సమాజంలో మహిళలకు ‘‘ఎలా మాట్లాడాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి వంటి ఎన్నో షరతులు ఉంటాయని, కానీ మగవాళ్లకు ఉద్యోగం, సంపాదన తప్ప మరేమీ ఉండవని వ్యాఖ్యానించింది.
Latest News