![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 08, 2025, 02:17 PM
బీఆర్ఎస్ తలపెడుతున్న రజతోత్సవాలను విజయవంతం చేయాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పిలుపునిచ్చారు. ఈనెల 27న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజతోత్సవ సభ నేపథ్యంలో మంగళవారం రామన్నపేట మండల నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ చేపడుతున్న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని ప్రతి కార్యకర్త ఇందులో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు.