|
|
by Suryaa Desk | Thu, Mar 20, 2025, 07:01 PM
లూసిఫెర్కి సీక్వెల్ అయ్యిన L2 ఎంపురాన్ (దీనిని L2E అని కూడా పిలుస్తారు) మాలీవుడ్లో తదుపరి అతిపెద్ద విడుదలకు సిద్ధంగా ఉంది, దానితో పాటు తెలుగు వెర్షన్ కూడా విడుదలకి ప్లాన్ చేయబడింది. నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించారు. లూసిఫెర్కు చాలా అంచనాలు ఉన్న సీక్వెల్గా ఈ యాక్షన్ థ్రిల్లర్ మార్చి 27, 2025న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్లకు అన్ని చోట్ల నుండి మంచి స్పందన వచ్చింది. తాజాగా చిత్ర బృందం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న L2 ఎంపురాన్ వరల్డ్ వైడ్ గా 11.20 కోట్ల ప్రీ సేల్స్ ని క్రాస్ చేసినట్లు ప్రకటించారు. ఇది మలయాళం చిత్రంకి అల్ టైమ్ రికార్డు గా నిలిచింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేయగా, దీపక్ దేవ్ సంగీతం సమకూర్చారు. అఖిలేష్ మోహన్ ఎడిటర్ గా ఉన్నారు. ఈ సినిమా మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో టోవినో థామస్, ఇంద్రజిత్ సుకుమారన్, మంజు వారియర్, సానియా ఇయప్పన్, సాయి కుమార్, అర్జున్ దాస్ మరియు సచిన్ ఖేదీకర్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఆశీర్వాద్ సినిమాస్ మరియు లైకా ప్రొడక్షన్స్ పతాకాలపై ఆంటోని పెరుంబవూర్ మరియు అల్లిరాజా సుభాస్కరన్ సంయుక్తంగా ఎల్ 2 ఎంపురాన్ చిత్రాన్ని నిర్మించారు.
Latest News