![]() |
![]() |
by Suryaa Desk | Sat, Apr 05, 2025, 08:28 PM
ఆది సాయి కుమార్ తన అప్ కమింగ్ ప్రాజెక్ట్ తో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధమవుతున్నాడు. యుగంధర్ ముని దర్శకత్వంలో రానున్న ఈ చిత్రానికి 'శంభాల' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ ప్రాజెక్ట్ శరవేగంగా జరుగుతోంది. ఆది సాయి కుమార్ జియో సైంటిస్ట్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో అర్చన అయ్యర్ కథానాయికగా నటిస్తుంది. తాజాగా శంబాల మేకర్స్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న మధునందన్ ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు. ఈ చిత్రంలో నటుడు హనుమంతు అనే పాత్రలో నటిస్తునట్లు ప్రకటించారు. శంబాలా ఒక ప్రత్యేకమైన టైటిల్ మరియు ఆసక్తికరమైన ఆవరణతో కూడిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్. ఈ చిత్రంలో స్వాసిక, రవివర్మ, మీసాల లక్ష్మణ్, మధు నందన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హన్స్ జిమ్మర్ వంటి ప్రముఖ హాలీవుడ్ కంపోజర్లతో పనిచేసిన శ్రీరామ్ మద్దూరి ఈ చిత్రానికి సంగీతం అందించారు. రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి ఈ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.
Latest News