by Suryaa Desk | Wed, Jun 26, 2024, 03:35 PM
ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణకు ప్రతి మండలానికి ఒక యంఈఓ పోస్ట్ ఉండగా. 13మండలాలలో ఖాళీగా ఉండటంతో పర్యవేక్షించే వారు కరువయ్యారు. ఉన్నత పాఠశాలల హెచ్ఎంలకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించడంతో పాఠశాలలలో రోజువారీ విధులు చూసుకుంటూనే ఇటు యంఈఓలుగా విధులు నిర్వర్తించడం కష్టతరంగా మారింది. దీనికితోడు 2, 3 మండలాలకు కలిపి ఒక ఇన్చార్జ్ యంఈఓగా కొనసాగుతున్నారు. జిల్లా కేంద్రమైన వనపర్తి మండలానికి సైతం రెగ్యులర్ యంఈఓలేరు.