by Suryaa Desk | Sun, Oct 06, 2024, 09:40 PM
గంజాయి విక్రయిస్తున్న మహిళను శంషాబాద్ డీపీఈవో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుంచి 1కిలో125 గ్రా ఎండు గంజాయితో పాటు మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విక్రయాలపై విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం డీటీఎఫ్ శంషాబాద్ బృందం లోధా బస్తీ, నానక్రామ్గూడ, శేరిలింగంపల్లిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈ క్రమంలో నానక్ రామ్ గూడ లో ఉంటున్న జయశ్రీ భర్త ఫకీరా సింగ్ (40) ఇంటిలో (1.125) కిలోల ఎండు గంజాయి పట్టుబడింది.
దీంతోపాటు మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఆమె తన బంధువు మహేందర్ సింగ్ ధూల్పేట్ నుండి ఎండు గంజాయిని తీసుకువచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నది. స్వాధీనం చేసుకున్న గంజయితోపాటు నిందితులను యస్ హెచ్ఓ శేరిలింగంపల్లికి అప్పగించారు.