by Suryaa Desk | Sat, Sep 14, 2024, 10:45 AM
నగరంలో రోజురోజుకి పెరిగిపోతున్న వాహనాల రద్దీని తగ్గించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు సర్వీస్ రోడ్లను అభివృద్ది చేస్తున్నారు. త్వరలో సైబర్టవర్స్ ఫ్లై ఓవర్ ల్యాండింగ్ పాయింట్ నుంచి జేఎన్టీయూ రూట్లో యశోదా హాస్పిటల్ వరకు సర్వీస్రోడ్డును నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు.ఈ పనుల కారణంగా ఉదయం, సాయంత్రం వేళల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు ట్రాఫిక్ అధికారులు తెలిపారు. ఈ నెల 14 నుంచి 30వరకు వాహనాల రూట్ మళ్లింపు అమలులో ఉంటుందని సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ తెలిపారు. సైబర్ టవర్స్, 100 ఫీట్రోడ్డు, కొత్తగూడ జంక్షన్వైపు నుంచి జేఎన్టీయూ, మూసాపేట వైపు వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని సూచించారు.జేఎన్టీయూ, మూసాపేట వైపు వెళ్లే వాహనదారులు100 ఫీట్రోడ్డు మీదుగా పర్వత్నగర్జంక్షన్, కైత్లాపూర్బ్రిడ్జి మీదుగా వెళ్లాలి. ఐకియా, సైబర్ గేట్వే, సీఓడీ జంక్షన్ నుంచి సైబర్ టవర్స్ ఫ్లైఓవర్మీదుగా జేఎన్టీయూ వైపు వెళ్లాలి. సైబర్ టవర్స్ ఫ్లై ఓవర్ కింద నుంచి జేఎన్టీయూ వైపు వెళ్లే వాహనదారులు ఎన్గ్రాండ్హోటల్, ఎన్ కన్వెన్షన్, జైన్ ఎంక్లేవ్, యశోదా హాస్పిటల్బ్యాక్ సైడ్ రోడ్డు, ఆర్ఓబీ ఫ్లైఓవర్మీదుగా జేఎన్టీయూ వైపు వెళ్లాలి.