by Suryaa Desk | Sun, Oct 06, 2024, 10:09 PM
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబం బతకమ్మ సంబరాలని ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం ఆత్మకూరు మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయం ముందు మహిళా ఉద్యోగులు, అధికారులు తెలంగాణ అతిపెద్ద పండుగైన బతకమ్మ సంబరాలను ఆటపాటలు, నృత్యాలతో నిర్వహించుకున్నారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే కాక ప్రపంచ దేశాలలో బతుకమ్మ పర్వదిన వేడుకలను నిర్వహించుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఏపిఎం లలితాదేవి, ఐసిడిఎస్ సూపర్వైజర్ పద్మావతి, పంచాయతీ కార్యదర్శులు, అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులు, పాల్గొన్నారు.