by Suryaa Desk | Sun, Oct 06, 2024, 10:14 PM
మండలంలోని వివిధ గ్రామాలలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ కార్యక్రమం. మండల కేంద్రంలోని బిజెపి మండల అధ్యక్షుడు పొదిల్లా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ధనసరి, అర్పణ పెళ్లి, కేసముద్రం స్టేషన్ , వివిధ గ్రామాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది.
ఈ సందర్భంగా వికాసిత్ భారత్ నిర్మాణంలో భాగంగా ప్రతి ఒక్కరు నరేంద్ర మోడీ సారధ్యంలో భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యత్వ నమోదు జిల్లా ఇంచార్జ్ గూగుల్ లక్ష్మణ్ నాయక్ అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఇంచార్జ్, జిల్లా ఉపాధ్యక్షులు మొరెడ్డి సురేందర్, జిల్లా ఉపాధ్యక్షులు తుంపిల్ల శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి గాంతీ వెంకటరెడ్డి, భువనగిరి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు