by Suryaa Desk | Mon, Oct 07, 2024, 12:26 PM
సింగరేణి కార్మికులకు బోనస్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ప్రజాభవన్లో జరిగింది. కార్మికులకు రూ. 796 కోట్ల బోనస్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, శ్రీధర్బాబు హాజరయ్యారు. 2023-24 సంవత్సరానికి సింగరేణికి రూ.2,412 కోట్ల లాభం వచ్చింది. లాభాల్లో 33 శాతాన్ని కార్మికులకు బోనస్గా ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కో కార్మికుడికి సగటున రూ.1.9 లక్షలు రానుంది.ఈ కార్యక్రమంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు సింగరేణి లాభాల్లో కార్మికులకు కోతపెట్టాయని అన్నారు. దాదాపు లక్ష మంది పనిచేసే సింగరేణి సంస్థను బతికించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని పేర్కొన్నారు. కార్మికులు సింగరేణి సంస్థకు ఆదాయం తీసుకువస్తున్నారని అన్నారు.‘‘చెన్నూరు, రామగుండంలో నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు చేశాం. 1800కుపైగా ఉద్యోగ నియామకాలు చేపడుతున్నాం. గతంలో నియామక ప్రక్రియలో చాలా మంది ఇబ్బందులు పడ్డారు. పారదర్శకంగా ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తాం’’ అని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.