by Suryaa Desk | Mon, Oct 07, 2024, 02:46 PM
నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ని ప్రజావాణి కార్యక్రమంలో సోమవారం బిఎస్పి నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో బిఎస్పీ జిల్లా మాజీ అధ్యక్షులు పృథ్వీరాజ్ మాట్లాడుతూ, జిల్లా కేంద్ర మున్సిపాలిటీలో కోటి రూపాయల అవినీతి ఆరోపణలు రావడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రభుత్వ యంత్రాంగం సక్రమంగా పనిచేయకపోవడం వల్ల మారుమూల ప్రాంతాల్లో పరిపాలన పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే భయమేస్తోందని అన్నారు.