by Suryaa Desk | Mon, Oct 07, 2024, 12:37 PM
పటాన్ చెరువు మండలం ఇస్నాపూర్ X రోడ్ లో వడ్డెర సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్డే ఓబన్న వర్థంతి కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెడ్డెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ పాల్గొని పూలమాలవేసి నివాళ్లు అర్పించారు. బీసీ ల అభ్యున్నతికి కృషిచేసేందుకు తెల్లదొరల వెన్నులో వణుకు పుట్టించిన మన రేనాటి వీరుడు వడ్డే ముద్దుబిడ్డ, స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్న గారి ఆశయాలు అనుసరించడం అవసరం అని నీలం మధు తెలిపారు, రాలు కొట్టి జీవనోపాధి సాగిస్తూ కష్టాని నమ్ముకుని బ్రతికే వడ్డేర సోదరులకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, సబ్బండ వర్గాల అభ్యున్నతికి తను ఎలవేళల కృషిచేస్తానని అన్నారు, వడ్డేరులకు వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేసి జెరిపాటి జైపాల్ గారిని చైర్మన్ గా నియమించిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని ఆయన గుర్తు చేశారు, ఈ సందర్భంగా నీలం మధు గారిని నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికి సత్కరించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఎంపీటీసీ గడ్డం శ్రీశైలం, మాజీ సర్పంచ్ సుంకరి రవీందర్, అలకుంట కృష్ణ,కోడిధాల వెంకటేష్, సూర సతీష్,రమేష్, కుంచం కుమార్,శువరాజు,నరేష్,వైకుంఠం, అంజీ,సైదులు,వెంకన్న,మహేష్,అజయ్, రాఘవేంద్ర,వలేపు వెంకటేష్, శ్రీను,దస్తగిరి,మణికంఠ,వడ్డెర సంఘం సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.