by Suryaa Desk | Mon, Oct 07, 2024, 06:35 PM
అత్యాధునిక ద్విచక్రవాహనాల చోరీకి పాల్పడుతున్న బైక్ నేరస్థుల ముఠాను బాచుపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు నిందితుల నుండి సుమారు 12 లక్షల విలువైన 9 బైక్ లను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీపీ కార్యాలయంలో వెల్లడించారు. పామర్తి హిమాన్ష్ (19) అనిల్ (19 )లు ఇద్దరు స్నేహితులు వీరు బాచుపల్లిలో నివాసం ఉంటున్నారు. వీరిద్దరితో పాటు మరో మైనర్ బాలుడు వీరంతా కలిసి ముఠాగా ఏర్పడ్డారు.
గత కొన్నిరోజులుగా బాచుపల్లి, కేపీహెచ్ బీ, ఆర్సీపురం సహా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో కేటీఎం,ఆర్15లతో సహా తొమ్మిది మోటార్ సైకిళ్లను దొంగిలించారు. విశ్వసనీయ సమాచారం మేరకు బాచుపల్లి పోలీసులు తనిఖీలు నిర్వహించగా వీరు పట్టుబడ్డారు. విచారిస్తే కొన్ని రోజులుగా బైక్ లు దొంగిలిస్తున్నట్లు తెల్సింది. సుమారు 12 లక్షల విలువైన తొమ్మిది ద్విచక్రవాహనాల వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను,ఒక మైనర్ బాలుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.