by Suryaa Desk | Mon, Oct 07, 2024, 07:48 PM
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇల్లు లేని నిరుపేదలకు ఇండ్లు కట్టేయాలని ఆలోచనతో ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రవేశపెట్టినారు అందులో భాగంగానే ఔట్సోర్సింగ్ పద్ధతిలో 1700 మంది ఉద్యోగులను తీసుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు 54 మంది నాన్ టెక్నికల్ ఉద్యోగులను మిషన్ కాకతీయలోకి పంపినారు మిగతా ఉన్న 1179 మందిని నిర్దాక్షిణ్యంగా విధుల నుండి తొలగించినారు అప్పటినుండి మేము మా కుటుంబాలు రోడ్డున పడ్డాయని ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి.
ప్రభుత్వం మళ్లీ గృహ నిర్మాణ సంస్థను నెలకొల్పి ఇందిరమ్మ ఇండ్లను గూడులేని నిరుపేదలకు పక్కా ఇల్లు మంజూరు చేయాలని ఆలోచనతో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి తెరపైకి తెచ్చారు ఇట్టి పథకంలో తొలగించిన 1179 మంది ఉద్యోగులను భాగస్వాములను చేసి రోడ్డున పడ్డ మా కుటుంబాలను ఆదుకోవాలని కోదండరాంకు వినతిపత్రం ఇచ్చారు. దీనిపై స్పందిస్తూ తప్పకుండా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి మీ ఉద్యోగాలు మీకు ఇప్పించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో అశోక్ ప్రభాకర్, యాకూబ్, సరిత,రాధాకృష్ణ, సురేష్, పాషా తదితరులు పాల్గొన్నారు