by Suryaa Desk | Mon, Oct 07, 2024, 07:53 PM
ఈరోజు హనుమకొండలో రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు చిట్యాల శ్వేత ను ఆత్మకూరు మండలం నీరుకుల్లా గ్రామానికి చెందిన రజక సంఘం నాయకులు ఘనంగా సన్మానించినారు.
భూమికోసం భుక్తి కోసం రజాకార్లను గడగల్లాడించిన వీరనారి చాకలి ఐలమ్మ వారసులైన చిట్యాల శ్వేతను ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళా కమిషన్ సభ్యురాలు గా నియమించడంతో విషయం తెలుసుకున్న నీరుకుల్ల గ్రామ రజక సంఘం అధ్యక్షులు దురిశెట్టి రాంబాబు కొత్తపెళ్లి సారంగం శనిగరపు శరబంధం కొత్త పెళ్లి అశోక్ తదితరులు అందరు కలిసి చిట్యాల శ్వేతను పూల బొకే ఇచ్చి శాలువతో ఘనంగా సన్మానించినారు.