by Suryaa Desk | Mon, Oct 07, 2024, 07:05 PM
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ కార్పొరేషన్ పరిధి బాచుపల్లి కౌసల్య కాలనీలో శరన్నవరాత్రి ఉత్సవాల ఘనంగా జరిగాయి. అనంతరం శ్రీ వెంకట శివ శ్రీరామ ఆంజనేయ లలిత అమ్మవారి ఆలయంలో 17వ డివిజన్ కార్పొరేటర్ ఆగం రాజు ముదిరాజ్ ఏర్పాటు చేసిన దుర్గా దేవి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమెల్సీ శంభీపూర్ రాజు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరిపై ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ధనరాజ్, బౌరంపేట్ పీఏసీఎస్ ఛైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి, కార్పొరేటర్ బాలాజీ నాయక్, నిజాంపేట బీఆర్ఎస్ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, నాయకులు చందు, మరియు స్థానిక నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.