by Suryaa Desk | Mon, Oct 07, 2024, 07:02 PM
చింతపల్లి మండల పరిధిలోని శ్రీ సాయి సన్నిధి ఆలయం వెనుక అరు మరియు శ్రీమిత్ర స్థిరాస్తి రంగంలో దిగ్గజ సంస్థలు వారు ఏర్పాటు చేసిన సాయి సన్నిధి పూర్తిస్థాయిలో డీటీసీపీ లే ఔట్తో కూడిన ప్లాట్, విల్లాస్, రిసార్ట్స్ లకు సంబందించిన వెంచర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ హాజరైనారు, సినీ హీరోలు శ్రీకాంత్, తరుణ్ తో కలిసి వెంచర్ ను ప్రారంభించి,అరు మరియు శ్రీమిత్ర సంస్థ వారికి శుభాకాంక్షలు తెలిపారు.
వెంచర్లు ఏర్పాటు చేసే నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలకు అనుకూలంగా ఏర్పాటు చేసుకోవాలని, పూర్తిస్థాయిలో డీటీసీపీ లే ఔట్తో ప్లాట్లను వినియోగదారులకు విక్రయించాలని సూచించారు. పాట్లను కొన్న తర్వాత ఇబ్బందులు పడకూడదని నిర్వాహకులే పూర్తిస్థాయిలో వారికి నమ్మకం కలిగించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు,పలు సంస్థ వారు,కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ నాయకులు తదితరులు పాల్గొన్నారు.